కెమెరా కన్ను మారింది

mahesh babu movie camera man changed - Sakshi

‘‘హ్యాపీ బర్త్‌డే సార్‌.. మీరు మరిన్ని  సక్సెస్‌లు సాధించాలి. ప్రతి ఏడాది గ్రేట్‌ ఫిల్మ్స్‌కి వర్క్‌ చేయాలి’’... ఇదిగో ఇలాగే ఆల్మోస్ట్‌ 20 డేస్‌ బ్యాక్‌ హీరో మహేశ్‌బాబు ఛాయాగ్రాహకుడు రవి కె. చంద్రన్‌కు బర్త్‌డే విషెస్‌ తెలిపారు. అంతేకాదు చిత్రబృందం అంతా బర్త్‌డే పార్టీ చేసుకున్నారు కూడా. అయితే ఇప్పుడో స్మాల్‌ చేంజ్‌. కెమెరా కన్ను మారింది. అదేనండీ.. రవి కె. చంద్రన్‌ ప్లేస్‌లో కెమెరామేన్‌ తిరునావక్కరసు వర్క్‌ చేయనున్నారు.

‘జనతా గ్యారేజ్, 24, వనమగన్‌’ వంటి చిత్రాలకు కెమెరామేన్‌గా చేశారు తిరు. ఇప్పుడు మహేశ్‌బాబు సినిమాలోకి ఎంటరయ్యారాయన. కొరటాల శివ దర్శకత్వంలో మహేశ్‌బాబు హీరోగా ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ‘భరత్‌ అనే నేను’ టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. ఇదివరకే కమిట్‌ అయిన వేరే ప్రాజెక్ట్స్‌ కోసం రవి కె. చంద్రన్‌ ఈ సినిమా నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఆ స్థానంలోకి తిరు వచ్చారు. స్నేహపూర్వకంగానే రవి కె. చంద్రన్‌ ఈ ప్రాజెక్ట్‌ నుంచి అవుట్‌ అయ్యారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top