‘మహర్షి’ కోసం భారీ సెట్
సూపర్ స్టార్ మహేష్ బాబు సిల్వర్ జూబ్లీ మూవీగా తెరకెక్కుతున్న సినిమా మహర్షి. దిల్రాజ్, అశ్వనీదత్, పీవీపీలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం అమెరికాలో జరుగుతోంది. మరో 20 రోజులు పాటు అక్కడే షూటింగ్ జరగనుంది. ఈ షెడ్యూల్ తరువాత హైదరాబాద్లో మరో షెడ్యూల్ను ప్లాన్ చేస్తున్నారు. అందుకోసం భారీ సెట్ను నిర్మిస్తున్నారు.
రామోజీ ఫిలిం సిటీలో మహర్షి సినిమా కోసం ఓ గ్రామాన్ని సెట్ వేస్తున్నారు. ఆర్ట్ డైరెక్టర్ సునీల్బాబు ఆధ్వర్యంలో ఈ సెట్ నిర్మణం జరుగుతోంది. చిత్రయూనిట్ అమెరికా నుంచి వచ్చిన వెంటనే ఈ సెట్లో చిత్రీకరణ ప్రారంభించనున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తుండగా అల్లరి నరేష్ కీలక పాత్రలో కనిపించనున్నాడు.