బాలీవుడ్‌ పిలుస్తోంది

Keerthy Suresh to make her Bollywood - Sakshi

‘మహానటి’ చిత్రం కీర్తీ సురేశ్‌ను సౌత్‌లో సూపర్‌ పాపులర్‌ హీరోయిన్‌ను చేసింది. తెలుగు, తమిళంలో స్టార్‌ హీరోలందరితో జోడీగా నటిస్తున్నారు. లేటెస్ట్‌గా రజనీకాంత్‌ సరసన నటించే  అవకాశం కూడా దక్కించుకున్నారని కోలీవుడ్‌ టాక్‌. ఇదో గుడ్‌ న్యూస్‌. ఇప్పుడు మరో గుడ్‌ న్యూస్‌ చెప్పడానికి రెడీ అయ్యారు కీర్తీ.

ఈ ఏడాది బాలీవుడ్‌లోకి అడుగుపెట్టనున్నారట. గతేడాది బ్లాక్‌బస్టర్‌ ‘బదాయి హో’ చిత్రాన్ని రూపొందించిన అమిత్‌ శర్మ దర్శకత్వంలో హిందీ పరిశ్రమకు పరిచయం కానున్నారట. ఈ చిత్రాన్ని  నిర్మాత బోనీ కపూర్‌ నిర్మించనున్నారు. మరి..  నార్త్‌ అభిమానులను కూడా ఎలా మెప్పిస్తారో వేచి చూడాలి.  ఆల్రెడీ గతే డాది ‘మహానటి, సర్కార్‌’ వంటి హిట్‌లు సాధించిన కీర్తీ ఈ ఏడాది కూడా హిట్ల మీద హిట్లతో దూసుకెళతారా?

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top