సారీ.. ఇప్పుడే రాను!: కాజల్
చెన్నై : సారీ.. ఇప్పుడే రాను అని ఖరాఖండీగా చెప్పేసింది కాజల్ అగర్వాల్. ఇంతకీ ఈ అమ్మడు దేని గురించి చెప్పింది. బాలీవుడ్లో పెద్దగా రాణించలేకపోయినా ఈ బ్యూటీ దక్షిణాదిలో ప్రముఖ కథానాయికగానే రాణిస్తోంది. అలా నటిగా అర్ధసెంచరీని ఆలవోకగా దాటేసిన కాజల్అగర్వాల్ ఇప్పటికీ కథానాయికగానే రాణిస్తోంది. ప్రస్తుతం తమిళంలో కమలహాసన్కు జంటగా ఇండియన్– 2 చిత్రంలో నటిస్తోంది. శంకర్ దర్శకత్వంలో లైకా సంస్థ నిర్మిస్తున్న ఈ భారీ చిత్ర షూటింగ్లో ఇటీవల ఓ దుర్ఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే.
(చదవండి : కమల్, కాజల్కు తప్పిన ముప్పు)
ఆ ప్రమాదంలో కృష్ణ అనే సహాయ దర్శకుడు, చంద్రన్ అనే సహాయ కళాదర్శకుడు, మధు అనే మరో సహాయకుడు ప్రాణాలను కోల్పోయారు. కాగా ఆ సంఘటన జరిగిన ప్రాంతంలో చిత్ర యూనిట్తో పాటు నటి కాజల్ అగర్వాల్ కూడా ఉంది. అంతే కాదు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకుంది. ఆ సంఘటనను చాలా దగ్గరగా చూసింది. దీంతో చాలా దిగ్భ్రాంతికి గురైన కాజల్ అగర్వాల్ ఆ షాక్ నుంచి బయటపడడానికి చాలా సమయం పట్టిందని చెప్పింది. కాగా ఈ సంఘటన తరువాత కాజల్ అగర్వాల్ బయటకు రాకుండా ఇంట్లోనే ఉండిపోయిందట.
మహాశివరాత్రి సందర్భంగా ఈషా ఫౌండేషన్ కోయంబత్తూర్లో నిర్వహించిన కార్యక్రమంలో మాత్రం పాల్గొన్న కాజల్ ఆ తరువాత ఇంటి నుంచి బయటకు రాలేదట. అంతే కాదు మరో రెండు వారాల పాటు చిత్ర షూటింగ్లోనూ పాల్గొనని ఇండియన్–2 చిత్ర నిర్మాతలకు ఖరాఖండీగా చెప్పినట్లు సమాచారం. కాగా కాజల్ తమిళంలో దుల్కర్సల్మాన్కు జంటగా మరో చిత్రంలోనూ నటిస్తోంది. ఆ చిత్రం నిర్మాణంలో ఉంది. మరి ఆ చిత్ర షూటింగ్లో ఎప్పుడు పాల్గొంటుందో మరి. అదేవిధంగా తెలుగులో మోసగాళ్లు అనే చిత్రంలోనూ, హిందీలో ఒక చిత్రం చేస్తూ ఈ అమ్మడు బిజీగా ఉంది. ఇకపోతే 34 ఏళ్ల కాజల్కు ఇంట్లో పెళ్లి సంబంధాలు చూసే పనిని వేగవంతం చేస్తున్నారట. మరో పక్క ఈ భామ ఒక పారిశ్రామిక వేత్తతో ప్రేమలో ఉందనే ప్రచారం హల్చల్ చేస్తోంది. వీటిలో ఏది నిజం అన్నది కాజల్ చెబితేనే గానీ తెలిసే అవకాశం లేదు.