కాజల్ కన్ఫార్మ్
యువ హీరో బెల్లంకొండ సాయిశ్రీనివాస్ సినిమాల్లో కథానాయిక ప్లేస్ స్పెషల్గానే ఉంటుంది. సమంత, రకుల్ ఇప్పటికే అతనితో జతకట్టారు. త్వరలో విడుదల కానున్న ‘సాక్ష్యం’లో పూజా హెగ్డే నటిస్తున్నారు. తాజా సినిమాలో కాజల్ అగర్వాల్ కథానాయికగా నటించనున్నారు. సాయి శ్రీనివాస్ హీరోగా వంశధార క్రియేషన్స్ పతాకంపై శ్రీనివాస్ని దర్శకునిగా పరిచయం చేస్తూ నవీన్ శొంటినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో కాజల్ నటించనున్నారని కొన్ని రోజులుగా వార్తలు వచ్చాయి.
మంగళవారం ఆ విషయాన్ని అధికారికంగా చిత్రబృందం ధృవీకరించింది. ఇందులో బాలీవుడ్ నటుడు నీల్నితిన్ ముఖేశ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం హైదరాబాద్లో చిత్రీకరణ జరుగుతోంది. ‘‘థ్రిల్లింగ్ మూవీ. హీరోను సరికొత్తగా ప్రజెంట్ చేయనున్నాం. నెక్ట్స్ షెడ్యూల్ నుంచి కాజల్ షూటింగ్లో పాల్గొంటారు’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: తమన్.