‘ఆర్ఆర్ఆర్’లో ఎవరెవరికెంత?
టాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్ అయిన ‘ఆర్ఆర్ఆర్’కు జాతీయ స్థాయిలో బజ్ ఏర్పడింది. బాహుబలి తరువాత దర్శక ధీరుడు రాజమౌళి.. ఈ ప్రాజెక్ట్ను అనౌన్స్ చేసిన్పటినుంచీ సినీ అభిమానులు దీని గురించి చర్చిస్తూనే ఉన్నారు. ఈ సినిమాపై వచ్చే ప్రతీ విషయం వైరల్ అవుతూనే ఉంది.
అయితే ఈ ప్రాజెక్ట్ పనులు త్వరలోనే మొదలుకానున్నాయి. ఇప్పటికే ఎన్టీఆర్ను ఈ ప్రాజెక్ట్కు తగ్గట్టుగా మలచడానికి లాయిడ్ స్టీవెన్ రంగంలోకి దిగాడు. డిసెంబర్లో షూటింగ్ మొదలుకానున్నట్లు సమాచారం. ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించిన మరో వార్త వైరల్ అవుతోంది. ఈ సినిమాకు రామ్చరణ్, ఎన్టీఆర్ పారితోషకాలకు సంబంధించిన పుకార్లు హల్చల్ చేస్తున్నాయి. మాములుగా ఓ సినిమాకు వారికున్న ఇమేజ్, డిమాండ్ దృష్ట్యా దాదాపుగా ఇరవై కోట్లు తీసుకుంటారని సమాచారం. అయితే ఈ సినిమాకు వారిద్దరు కాల్షీట్లు భారీ మొత్తంలో కేటాయిస్తున్నందున రెగ్యులర్ సినిమాలకు తీసుకుంటున్నట్లుగా కాకుండా... కొంత షేర్ను తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్లో చాలా మంది హీరోలు ఇదే ఫార్మూలాను ఫాలో అవుతున్నారు. ప్రాఫిట్లో షేర్ను డిమాండ్ చేస్తూ ఫుల్గా వసూలుచేసుకుంటున్నారు.
సంబంధిత వార్తలు
మరిన్ని వార్తలు