'దేనికైనా రెడీ'పై హైకోర్టు తీర్పు
హైదరాబాద్: 'దేనికైనా రెడీ' సినిమాపై హైకోర్టు తీర్పు వెల్లడించింది. సినిమాలో రెండు సీన్లు తొలగించాలని హైకోర్టు తెలిపింది. కొన్ని అభ్యంతరాలున్నంత మాత్రాన మొత్తం సినిమాకు ఆపాదించ వద్దని హైకోర్టు పేర్కొంది. సినిమా ప్రేక్షకులను అలరించాలే తప్ప ఎవరినీ కించపరచకూడదని హైకోర్టు తెలిపింది. కోట్ల రూపాయలతో సినిమాలు తీసే నిర్మాతలు జాగ్రత్తలు వహించాలని హైకోర్టు సూచించింది.
హీరో మంచు విష్ణు, హీరోయిన్ హన్సిక జంటగా జి.నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో రూపొందిన 'దేనికైనా రెడీ' చిత్రంలోని కొన్ని దృశ్యాలు హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ఉన్నాయని కొన్ని హిందూ సంస్థలు ఆందోళన చేశాయి. ఓ ముస్లిం.. చండీ యాగం చేయించడం, యజ్ఞం చేస్తున్న సమయంలో మరో మతస్తుడిని ఆచార్యులుగా చూపించడం వివాదానికి దారితీసింది.
ఛండీయాగంలో మంత్రాలకు బదులుగా బ్రహ్మాణోత్తములచే సినిమా పాటలు పాడించడం వేదాన్ని అవమానించినట్లేనన్నది మరో వివాదం. మాసంతో చేసిన హలీంను బ్రహ్మణోత్తములకు తినిపించడం బ్రహ్మణుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయనేది మరో వివాదాంశం. బ్రహ్మణ మహిళ పాత్రను కూడా చిత్రంలో వ్యాంపు క్యారెక్టర్గా చిత్రీకరించారు. అది కూడా వివాదానికి దారి తీసింది.