నా పతనానికి అతనే కారణం!
తన జీవిత పతనానికి కారణం ఆయనే అంటోంది నటి షర్మిళ. 1990 ప్రాంతంలో ఆర్.సుందర్రాజన్ దర్శకత్వం వహించిన ఒయిలాట్టం చిత్రం ద్వారా కథానాయికిగా పరిచయమైన కేరళ భామ షర్మిళ. ఆ తరువాత కొన్ని చిత్రాల్లో వరసగా నటించిన ఈమె ఇక్కడ పెద్దగా రాణించలేకపోయింది. దీంతో మాతృభాషలో అవకాశాలను రాబట్టుకుని మలయాళంలో కథానాయకిగా మంచి పేరు సంపాదించుకుంది.అలా బిజీగా నటిస్తున్న సమయంలో నటుడు బాబుఆండియాతో ప్రేమలో పడింది. ఆ ప్రేమ బెడిసి కొట్టడంతో మలయాళ సహాయదర్శకుడు కిశోర్ సత్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది.
వివాహానంతరం నటనకు దూరమై షార్జాలో సంసార జీవితం సాగించింది.అయితే అదీ ఎంత కాలమో సాగలేదు. మనస్పర్థల కారణంగా కిశోర్సత్య నుంచి వివాహరద్దు పొందింది. ఆ తరువాత రాజేశ్ అనే మరో వ్యక్తిని పెళ్లాడింది. కొనేళ్ల తరువాత అతని నుంచి విడిపోయింది. ప్రస్తుతం అమ్మ పాత్రలకు పరిమితమైంది. అలా పలు మలుపులు తిరిగిన తన జీవిత మజిలీని షర్మిళ తెలుపుతూ తన జీవిత పతనానికి తన తొలి భర్త కిశోర్ సత్యనేనని ఆరోపించింది. తాను కథానాయకిగా పీక్లో ఉన్న దశలో నటుడు విక్రమ్తో నటించే అవకాశం రాగా ఆ చిత్రంలో నటించవద్దని కిశోర్సత్య ఒత్తిడి చేశాడని,అందుకే మంచి అవకాశాన్ని వదులు కోవలసి వచ్చిందని చెప్పింది. కోలీవుడ్లో అలా తన మార్కెట్ను కోల్పోయానని ఆవేదనను నటి షర్మిళ వ్యక్తం చేసింది.