తప్పుచేస్తే శిక్ష తప్పదు
అద్వైత్, జహీదా శ్యామ్, అలోక్ జైన్, సీతారెడ్డి ముఖ్య తారలుగా తెరకెక్కుతోన్న చిత్రం ‘ఎంతవారలైనా’. గురు చిందేపల్లి దర్శకత్వంలో రామదూత ఆర్ట్స్ పతాకంపై జి.సీతారెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంది. గురు చిందేపల్లి మాట్లాడుతూ– ‘‘ఎంతవారలైనా కాంత దాసులు కావచ్చు, కనకదాసులు కావచ్చు. కానీ, తప్పు చేసినప్పుడు ఎంతవారలైనా కచ్చితంగా శిక్షార్హులే అనే పాయింట్తో తెరకెక్కుతోన్న థ్రిల్లర్ హారర్ మూవీ ఇది. అన్ని వర్గాల వారికి నచ్చేలా ఉంటుంది’’ అన్నారు.
‘‘గురు చిందేపల్లి నా క్లాస్మేట్, చిరకాల మిత్రుడు. నాకు సినిమా మీద ఉన్న ప్యాషన్తో నిర్మాతనయ్యా. నటన మీద ఉన్న ఆసక్తితో డైరెక్టర్ ప్రోత్సాహంతో ఈ సినిమాలో ఒక పాత్ర కూడా చేశాను. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా స్టార్ట్ అయ్యాయి. త్వరలోనే ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తాం. మంచి కథాంశంతో సాగే ఈ చిత్ర ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది’’ అని జి.సీతారెడ్డి అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సుక్కు, కెమెరా: ఎస్.మురళీమోహన్రెడ్డి.