ఎనర్జిటిక్గా...
‘‘దృశ్యం, గోపాల గోపాల, డిక్టేటర్’ వంటి సినిమాలకు సహాయ దర్శకుడిగా పనిచేసిన శ్రీనివాస్ దర్శకునిగా పరిచయం అవుతున్నారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా వంశధార క్రియేషన్స్ ప్రొడక్షన్ నెం.1గా నవీన్ సొంటినేని (నాని) ఈ సినిమా నిర్మించనున్నారు. ఈ సందర్భంగా నిర్మాత నవీన్ మాట్లాడుతూ– ‘‘ఎనర్జిటిక్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తెరకెక్కనున్న చిత్రంతో మా బ్యానర్ను ప్రారంభిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. శ్రీనివాస్ బాడీ లాంగ్వేజ్కి తగ్గట్టే ఈ సినిమా ఎనర్జిటిక్గా ఉంటుంది.
దర్శకుడు శ్రీనివాస్ అద్భుతమైన కథను సిద్ధం చేశారు. ఈ చిత్రానికి ఛోటా కె.నాయుడు సినిమాటోగ్రాఫర్గా చేయనున్నారు. తమన్ స్వరాలు సమకూరుస్తారు. ఆర్ట్ డైరెక్టర్గా చిన్నాని ఎంపిక చేశాం. త్వరలోనే మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు చెబుతాం. మా ప్రొడక్షన్ నెం.1 ప్రారంభోత్సవ వేడుకను ఈ గురువారం ఘనంగా నిర్వహించనున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సహ నిర్మాత: చాగంటి శాంతయ్య, నిర్మాణం: వంశధార క్రియేషన్స్.