బాయ్ఫ్రెండ్ కోసం కేక్ చేసిన అలియా
అలియా భట్, రణ్బీర్ కపూర్ల బంధం మరింత బలపడింది. గతేడాది న్యూయర్ సందర్భంగా బాలీవుడ్ చాకోలెట్ బాయ్ అలియాకు ప్రపోజ్ చేయడం, ఆమె యాక్సెప్ట్ చేయడం, ఆ తర్వాత ‘రాజీ’ సినిమాలో ఇద్దరూ కలిసి జోడి కట్టడం వీరి రిలేషన్కు మరింత బలాన్ని చేకూర్చింది. అప్పటి నుంచి ఇద్దరూ కలిసి మీడియా కంటపడటం, సోషల్ మీడియాలో పోస్టింగ్లు, ఇంటర్వ్యూలు అన్నీ చకాచకా జరిగిపోతూనే ఉన్నాయి. తాజాగా ఈ చాకోలెట్ బాయ్ బర్త్డే సందర్భంగా అలియా కుక్గా కూడా మారిపోయారు. శుక్రవారం రణ్బీర్ కపూర్ బర్త్డే కావడంతో, స్వయంగా తన బాయ్ఫ్రెండ్ కోసం అలియానే స్పెషల్ కేక్ తయారు చేశారు. కేక్ను ప్రిపేర్ చేయడమే కాకుండా.. దాని పిక్చర్లను సోషల్ మీడియాలో అప్లోడ్ కూడా చేశారు.
హ్యాపీ బర్త్డే సన్సైన్ అంటూ ఇన్స్టాగ్రామ్లో విష్ చేసిన అలియా.. రణబీర్ కపూర్ కోసం తయారు చేసిన వెనీలా స్పాంజ్ కేక్ను ఫ్యాన్స్పేజీలో అప్లోడ్ చేశారు. ఆ కేక్ను ఫైనాపిల్తో అలకరించారు. ఇలా అలియా, తన బాయ్ఫ్రెండ్ బర్త్డేను ఎంతో స్పెషల్గా సెలబ్రేట్ చేశారు. ఒక్కరోజు ముందస్తుగానే అలియా తన తల్లి సోని రజ్దాన్తో కలిసి, రణ్బీర్ స్పెషల్ డేను సెలబ్రేట్ చేయడానికి డిన్నర్ పార్టీకి కూడా వెళ్లారు. ఆ సందర్భంగా ఏర్పాటు చేసిన గెట్ టూ గెదర్ మీటింగ్కు రణ్బీర్ కపూర్ తల్లి నీతూ కపూర్ కూడా హాజరయ్యారు. ఆ డిన్నర్కు సంబంధించిన పిక్చర్ ఇంటర్నెట్లో వైరల్గా కూడా మారిపోయింది. అలియా సోదరి షాహీన్ భట్ కూడా ఇన్స్టాగ్రామ్ ద్వారా రణ్బీర్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. రణ్బీర్ టీ తాగుతూ ఉన్న పిక్చర్ను షేర్ చేసిన ఆమె, ‘హ్యాపీ బర్త్డే లండన్ ఫ్రెండ్’ అంటూ పోస్టు చేశారు. రణ్బీర్, అలియా ప్రస్తుతం బ్రహ్మాస్త్ర షూటింగ్లో ఉన్నారు.
మరిన్ని వార్తలు