అల వైకుంఠపురములో...
సినిమా టైటిల్స్ను ‘అ’తో మొదలుపెట్టడం త్రివిక్రమ్ సెంటిమెంట్. ఆ సెంటిమెంట్ను మళ్లీ రిపీట్ చేశారు త్రివిక్రమ్. అల్లు అర్జున్తో చేస్తున్న సినిమాకు ‘అల వైకుంఠపురములో’ అనే టైటిల్ ఖరారు చేశారు. టైటిల్ టీజర్ను గురువారం రిలీజ్ చేశారు. టీజర్లో ‘ఏంటి గ్యాప్ ఇచ్చావు?’ అని మురళీ శర్మ అడగ్గా.. ‘ఇవ్వలేదు.. వచ్చింది’ అంటారు అల్లు అర్జున్. (గత ఏడాదిగా అల్లు అర్జున్ సినిమాలకు ఇచ్చిన గ్యాప్ను ఈ డైలాగ్కు సరదాగా అన్వయించుకోవచ్చు). ఈ సినిమాను అల్లు అరవింద్, చినబాబు నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే కథానాయిక. టబు కీలక పాత్రలో నటిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానుంది.
సంబంధిత వార్తలు
మరిన్ని వార్తలు