రాజమండ్రిలో ఢీ

ajith to go rajahmundry for his next movie shoot  - Sakshi

ప్రస్తుతం ముంబైలో ఉన్న అజిత్‌ విలన్స్‌ను ఢీ కొట్టడానికి రాజమండ్రి చేరుకోనున్నారట. ఆ తర్వాత మళ్లీ హైదరాబాద్‌లో మిగిలిన పని కాని చ్చేస్తారట. శివ దర్శకత్వంలో అజిత్‌ హీరోగా రూపొందుతున్న తమిళ చిత్రం ‘విశ్వాసం’. ఇందులో నయనతార కథానాయిక. సత్యజోతి ఫిల్మ్స్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం ముంబైలో జరుగుతోంది. అక్కడి నుంచి రాజమండ్రి షిఫ్ట్‌ కానుంది చిత్రబృందం. రాజమండ్రిలో కొన్ని ఇంపార్టెంట్‌ ఫైట్‌ సీన్స్‌ చిత్రీకరించనున్నారు. ఎక్కువ శాతం షూటింగ్‌ హైదరాబాద్‌లోనే జరుపుకోనున్న ఈ చిత్రం దీపావళికి రిలీజ్‌ కానుంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top