లావణ్యా ఐఏయస్
లావణ్యా త్రిపాఠికి రెండు తమిళ సినిమాలు చేసిన అనుభవం ఉంది. 2014లో వచ్చిన ‘బ్రహ్మమ్’, 2017లో వచ్చిన ‘మాయవాన్’ సినిమాల్లో నటించారామె. తాజాగా మూడో తమిళ సినిమా కమిటయ్యారు. అథర్వ మురళి హీరోగా నూతన దర్శకుడు రవీంద్ర మాధవ ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఇందులో హీరోయిన్గా లావణ్యా త్రిపాఠి నటించనున్నారు. ఈ సినిమాలో ఐఏయస్ కావాలనుకునే అమ్మాయిగా కనిపిస్తారట లావణ్య. ఆమె పాత్ర పవర్ఫుల్గా, కథను ముందుకు తీసుకెళ్లే విధంగా ఉంటుందట. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమైంది. ఇందులో అథర్వ పోలీస్ కాని స్టేబుల్గా నటిస్తున్నారు.