రెండు వేలమందితో యుద్ధం
జానపద కథాంశంతో రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘బాహుబలి’. ఈ సినిమాలో కీలకమైన యుద్ధ సన్నివేశాల చిత్రీకరణ ఈ నెల 15 నుంచి ఆర్ఎఫ్సీలో జరుగనుంది. ఈ ఎపిసోడ్లో ప్రభాస్ రెండు వేలమందితో తలపడనున్నారట. ఈ పోరాట సన్నివేశాలకు పీటర్ హెయిన్స్ ఫైట్ మాస్టర్గా వ్యవహరించనున్నారని, ఈ చిత్రానికి ఈ ఎపిసోడ్ చాలా కీలకమని విశ్వసనీయ సమాచారం. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించి మెయిన్ ఎపిసోడ్ను కేరళలో చిత్రీకరించారు.