66వ రోజు ప్రజాసంకల్పయాత్ర

సాక్షి, చిత్తూరు: వైఎస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర చిత్తూరు జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. ఆయన 66వ రోజు పాదయాత్రను శనివారం ఉదయం శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు మండలం కుక్కలవారి కండ్రిగ గ్రామం నుంచి ప్రారంభించారు.

అక్కడి నుంచి వెంకటాపురం క్రాస్, కుమ్మర మిట్ట, మోదుగు పాలెం క్రాస్, కొత్త వీరాపురం, అగ్రహారం, కంబాక, అంజిమీడు క్రాస్‌కు పాదయాత్ర చేరుకుంటుంది. మధ్యాహ్నం 12 గంటలకు భోజన విరామం తీసుకుంటారు. అనంతరం ఏర్పాడు, మేర్లపాక క్రాస్‌ మీదుగా చిందేపల్లి వరకు కొనసాగనుంది. కొత్తవీరాపురం, మేర్లపాక హరిజనవాడలో వైఎస్సార్‌సీపీ జెండాను జగన్‌ ఆవిష్కరించనున్నారు. రాత్రికి చిందేపల్లిలో వైఎస్‌ జగన్‌ బస చేస్తారు.



 

Back to Top