ఐపీఎల్ లైవ్ అప్డేట్స్
సాక్షి, ముంబై : ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-11లో భాగంగా నేడు ఫైనల్ మ్యాచ్ స్థానిక వాంఖెడే మైదానంలో చెన్నై సూపర్కింగ్స్(సీఎస్కే)- సన్రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఇప్పటివరకు ఐపీఎల్ టైటిల్ను సీఎస్కే రెండు సార్లు గెలుచుకోగా, సన్రైజర్స్ ఒక్క సారి గెలిచింది. రెండు సంవత్సరాల నిషేధం తర్వాత పునరాగమనం చేసిన సీఎస్కే కప్ గెలిచి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వాలని ధోని సేన భావిస్తుండగా, నేటి మ్యాచ్లో గెలిచి రెండో సారి కప్ ముద్దాడాలని సన్రైజర్స్ ఉవ్విళ్లూరుతోంది. బ్యాటింగ్,బౌలింగ్లలో ఇరుజట్లు బలంగా కనిపిస్తున్న తరుణంలో నేటి ఫైనల్ మ్యాచ్ హోరాహోరిగా జరుగుతందని అభిమానులు ఆశపడుతున్నారు.