చీర కొంగు చిక్కుకొని మహిళ మృతి
బెంగళూరు(హొసూరు): అజాగ్రత్త ఓ మహిళ ప్రాణాన్ని తీసింది. నడుస్తున్న బైక్ వెనక చక్రంలో చీర చిక్కుకోవడంతో, కిందపడి ఓ మహిళ మృతి చెందారు. ఈ సంఘటన కర్ణాటకలోని సింగారపేట పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకొంది. పోలీసుల కథనం మేరకు.. వేలూరు జిల్లా తిరుపత్తూరుకు చెందిన రాము, మీన(23) దంపతులు శనివారం క్రిష్ణగిరి జిల్లా సింగారపేటకు ద్విచక్రవాహనంలో వచ్చారు. పని ముగించుకొని తిరిగి వెళ్తుండగా గిడ్డంబట్టి వద్ద వెనుక చక్రంలో చీర కొంగు చిక్కుకుంది. దీంతో ఇద్దరూ కిందపడి గాయపడ్డారు. వీరిని సేలం ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మీనా మృతి చెందారు. ఘటనపై సింగారపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.