థాయ్ మాజీ ప్రధాని కన్నుమూత
బ్యాంకాక్: థాయ్లాండ్ మాజీ ప్రధాని జనరల్ ప్రేమ్ టిన్సులనోండా (98) ఆదివారం కన్నుమూశారు. ఈ మేరకు రాజప్రాసాదం అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు. 1980 నుంచి 1988 మధ్యకాలంలో టిన్సులనోండా మూడుసార్లు ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం మహారాజు సలహాదారుల కమిటీలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. 2016లో థాయ్లాండ్ రాజు భుమిబోల్ మృతి తర్వాత దేశ పరిపాలనలో కీలక భూమిక పోషించారు. తాజాగా ఇదే నెలలో జరిగిన భుమిబోల్ తనయుడు విజయాలంగ్కర్న్ పట్టాభిషేకం కార్యక్రమంలో ముఖ్య పాత్ర పోషించారు.