బంగ్లాదేశ్లో రెండు రైళ్లు ఢీ
ఢాకా: బంగ్లాదేశ్లో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో 16 మంది మరణించగా, మరో 60 మంది గాయపడ్డారు. బంగ్లాదేశ్లోని మొండోభాగ్ రైల్వే స్టేషన్ నుంచి ఉదయన్ ఎక్స్ప్రెస్ పట్టాలు మారుతుండగా, ఢాకా వైపు వెళుతున్న తుర్నా నిషితా ఎదురుగా వచ్చి ఢీకొట్టింది. లోకో మాస్టర్లు సిగ్నల్స్ను పాటించకపోవడం వల్లే ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు.
సంబంధిత వార్తలు