అమెరికాలో భారత టెకీ దుర్మరణం

Prashant Kukade Met With Accident - Sakshi

లూయిస్ విల్లె : అమెరికాలో మరో టెకీ దుర్మరణం పొందాడు. ప్రశాంత్‌ కుకాడే అనే టెకీ మంగళవారం రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందారు. మోటార్‌ సైకిల్‌, ఓ వాహనం ఒకాదానికొకటి ఢీకొట్టుకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఉదయం 8 గంటలకు బన్‌సెన్‌ వేలో ఈ ప్రమాదం జరిగినట్టు తెలిసింది. మోటార్‌సైకిల్‌, కియా ఆప్టిమాను ఢీకొట్టినట్టు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. ఈ ప్రమాదంలో మోటార్‌సైకిల్‌ నడుపుతున్న ప్రశాంత్‌ అక్కడిక్కడే మరణించినట్టు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ప్రశాంత్‌, ప్రస్తుతం హుమానాలో ఫ్రంట్ ఎండ్ డెవలప్‌మెంట్‌ టెక్‌కు అధినేతగా వ్యవహరిస్తున్నాడు. నాలుగేళ్లకు పైగా అతను అక్కడే పనిచేస్తున్నట్టు తెలిసింది. ఐటీ ఇండస్ట్రీలో ప్రశాంత్‌కు 15 ఏళ్లకు పైగా అనుభవముంది. మహారాష్ట్ర పుణేకు చెందిన ప్రశాంత్‌‌, ప్రస్తుతం లూయిస్‌విల్లెలో ఉంటున్నారు. ప్రశాంత్‌, ఎస్‌హెచ్‌జే పాలిటెక్నిక్‌లో సివిల్‌ ఇంజనీరింగ్‌లో డిప్లొమా చేశాడు. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top