జి–20 భేటీకి ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: ఈ నెల 27 నుంచి 29 వరకు జపాన్లోని ఒసాకాలో జరిగే జి–20 శిఖరాగ్ర సమావేశాలకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ శుక్రవారం వెల్లడించింది. మోదీ వెంట మాజీ కేంద్రమంత్రి సురేశ్ ప్రభు కూడా ఉంటారని ఆ శాఖ ప్రతినిధి రవీశ్ కుమార్ తెలిపారు. సదస్సులో పాల్గొనే పలు దేశాలతో మోదీ ద్వైపాక్షిక, త్రైపాక్షిక చర్చలు జరిపే అవకాశముందని తెలిపారు. జి–20లో ఇండియాతోపాటు అర్జెంటినా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, యురోపిన్ యూనియన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇండోనేసియా, ఇటలీ, జపాన్, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, దక్షిణ కొరియా, టర్కీ, బ్రిటన్, అమెరికా ఉన్నాయి.