మాల్దీవుల్లో కరోనా తొలి మరణం
మాలే/మాల్దీవులు: మాల్దీవుల్లో మొదటి కరోనా మరణం సంభవించింది. 83 సంవత్సరాల వయస్సు కలిగిన ఓ మహిళ గురువారం కరోనాతో మృతి చెందినట్లు ఆ దేశ ఆరోగ్యశాఖ అధికారి అబ్దుల్లా అమీన్ తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. కరోనాతో మృతి చెందిన మహిళకు ఏప్రిల్ 27న కరోనా పాజిటివ్ వచ్చిందని తెలిపారు. బాధితురాలు రాజధాని మగకు ప్రాంతానికి చెందిన మహిళగా పేర్కొన్నారు. శ్వాస తీసుకోవడంలో మహిళకు ఇబ్బంది ఏర్పడటంతో వేరే ఆసుపతత్రికి తరలిస్తుండగా మృతి చెందినట్లు తెలిపారు. ఇక మాల్దీవుల్లోని పర్యాట ప్రాంతంలో మొదటి కరోనా కేసు నమోదవ్వగా కొంతకాలం ఈ విషయాన్ని బయటకు రాకుండా అధికారులు అడ్డుకున్నారు. దీంతో ఆ ప్రాంతంలో కరోనా కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. కాగా ఇప్పటి వరకు మాల్దీవుల్లో 280 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. (ముగిసిన రిషీ కపూర్ అంత్యక్రియలు )