పాకిస్థాన్లో కీలక అల్ ఖైదా నాయకుడు హతం
ఇస్లామాబాద్: పాకిస్థాన్లో కీలక అల్ ఖైదా నాయకుడిని ఆదివారం హతమార్చారు. పాకిస్థాన్లో ఉత్తర వజీరిస్థాన్ గిరిజన ప్రాంతంలో అమెరికా దళాలు చేసిన క్షిపణి దాడుల్లో ఐదుగురు ఉగ్రవాదులు మరణించారు. మరో ముగ్గురు గాయపడ్డారు. మరణించినవారిలో కీలక అల్ ఖైదా నాయకుడు ఉమర్ ఫరూక్ అలియాస్ ఉమర్ ఉస్తాద్గా గుర్తించారు. దక్షిణ ఆసియా అల్ ఖైదా ప్రతినిధిగా వ్యవహరిస్తున్నట్టు పాక్ మీడియా వెల్లడించింది.