413కి చేరిన ఈక్వెడార్ భూకంప మృతులు


క్విటో: ఈక్వెడార్ భూకంప మృతుల సంఖ్య రోజురోజూకు పెరుగుతోంది. మృతుల సంఖ్య సోమవారానికి 413కు చేరిందని ఆ దేశ భద్రత మంత్రిత్వశాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ భూకంప ధాటికి 2,068 మంది గాయపడ్డారని పేర్కొంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. శిథిలాల  నుంచి క్షతగాత్రుల్ని వెలికి తీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పింది. ఈ సహాయక చర్యల్లో పాల్గొనేందుకు చిలీ, కొలంబియా, క్యూబా దేశాల నుంచి బృందాలు తరలివచ్చాయని  వెల్లడించింది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top