తుది దశకు బ్రిటన్‌ ప్రధాని రేసు

Britain leadership fight reaches final round - Sakshi

లండన్‌: బ్రిటన్‌  ప్రధానిగా థెరిసా మే స్థానంలో కొత్త కన్జర్వేటివ్‌ పార్టీ నేతను ఎన్నుకునే ప్రక్రియ గురువారం తుది దశకు చేరుకుంది. పాకిస్తాన్‌ సంతతికి చెందిన హోం మంత్రి సాజిద్‌ జావిద్‌ పోటీ నుంచి నిష్క్రమించగా ఈ పదవికి రేసులో ఉన్న మాజీ విదేశాంగ శాఖ మంత్రి బోరిస్‌ జాన్సన్‌ తిరుగులేని మెజారిటీతో ముందంజలో కొనసాగుతున్నారు. రహస్య బ్యాలెట్ల తుది రౌండ్‌లో బ్రిటన్‌ విదేశాంగ శాఖ మంత్రి జెరెమై హంట్‌ను పర్యావరణ శాఖ మంత్రి మైఖేల్‌ గోవ్‌ వెనక్కినెట్టడంతో ఈ రేసులో రెండో స్థానం కోసం జరుగుతున్న యుద్ధం మలుపు తిరిగింది.

తాజా సమాచారం ప్రకారం జాన్సన్‌ 157 ఓట్లతో మొదటి స్థానంలో ఉండగా గోవ్‌ (61) హంట్‌ (59) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. బ్రిటన్‌ సీనియర్‌ మోస్ట్‌ మంత్రి అయిన జావిద్‌కు మూడవ దశలో కేవలం 34 ఓట్లే వచ్చాయి. ఈ నేపథ్యంలో జాన్సన్, గోవ్‌ ప్రధాని పదవికి పోటీ పడనున్నారు. తుది ప్రక్రియలో భాగంగా వారు పలు సమావేశాల్లో ఓటర్లనుద్దేశించి ప్రసంగించాల్సి ఉంటుంది. రెండు టీవీ చర్చల్లో కూడా పాల్గొనాల్సి ఉంటుంది. జూలై 22న విజేతను ప్రకటించే అవకాశం ఉంది. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top