లక్ష దాటిన మరణాలు.. ట్రంప్‌ దిగ్భ్రాంతి

America Reached One Lakh Corona Deaths - Sakshi

వాషింగ్టన్‌ : అగ్రరాజ్యం అమెరికాలో కరోనా విలయ తాండవం చేస్తోంది. ప్రాణాంతక కోవిడ్‌ ఆ దేశంలో ఏకంగా లక్షమందిని బలి తీసుకుంది. ఈ విషయాన్ని అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తన అధికారిక ట్విటర్‌ ఖాతా ద్వారా స్వయంగా వెల్లడించారు. కరోనా కారణంగా మృతి చెందిన వారికి ట్రంప్‌ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇంతపెద్ద మొత్తంలో పౌరులు మరణించడం పట్ల ట్రంప్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాగా వైరస్‌ కారణంగా లక్ష మరణాలు చోటుచేసుకున్న తొలి దేశంగా అమెరికా నిలిచింది. ఇక ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 17 లక్షలు దాటింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు 58 లక్షలకు చేరుకున్నాయి.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top