ఎయిరిండియాకు 70 ఏళ్లు!

Air India marks 70 years since 1st India-UK flight - Sakshi

లండన్‌: ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిరిండియా సరికొత్త కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. లండన్‌కు ఎయిరిండియా తొలి విమానం చేరుకుని 70 ఏళ్లు పూర్తికానున్న సందర్భంగా బ్రిటన్‌లో భారతి సంతతి ప్రజల్ని తమ అనుభవాలను పంచుకోవాల్సిందిగా కోరుతోంది. 1948, జూన్‌ 8న ముంబై నుంచి బయలుదేరిన ఎయిరిండియా విమానం కైరో మీదుగా జూన్‌ 10న లండన్‌కు చేరుకుంది. భారత్‌కు చెందిన 42 మంది నవాబులు, రాజులు ఈ విమానంలో లండన్‌కు వెళ్లారు. ‘ఈ విమాన సేవల్ని తొలిరోజుల్లో వినియోగించుకున్న భారత సంతతి పౌరుల్ని కలసి వారి అనుభవాలు, స్మృతుల్ని, ఫొటోలను మాతో పంచుకోవాలని కోరతాం’ అని ఎయిర్‌ఇండియా యూకే, యూరప్‌ మేనేజర్‌ దెబాషిస్‌ గోల్డర్‌ తెలిపారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top