14 వేల మంది కువైట్ను వదిలేశారు..
కువైట్ : 14 వేల మంది అక్రమ వలసదారులు ఇప్పటివరకూ దేశం విడిచి వెళ్లారని కువైట్ హోం శాఖ మంత్రి షేక్ ఖలీద్ అల్ జెర్రా పేర్కొన్నారు. దేశంలో అక్రమంగా నివాసం ఉంటున్న వారు తిరిగి స్వదేశానికి వెళ్లడానికి కువైట్ అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే.
ఫిబ్రవరి 14 వరకూ దేశాన్ని వదిలి వెళ్లిన వారిలో అత్యధికంగా భారతీయులు ఉన్నట్లు చెప్పారు. ఫిబ్రవరి 22 వరకూ అక్రమ వలసదారులకు కువైట్ను విడిచి వెళ్లే అవకాశం ఉంటుంది. అయితే, ట్రావెల్ ఏజెన్సీల వద్ద భారీ ఎత్తున టికెట్లు బుక్ అవుతుండటంతో వలసదారులు వెళ్లేందుకు గడువును పెంచే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.