'టీఆర్ఎస్ ప్రయత్నాలు ఫలించలేదు'
హైదరాబాద్ : తెలంగాణలో ప్రతిపక్షం లేకుండా చేయాలని చూసిన అధికార టీఆర్ఎస్ ప్రయత్నాలు ఫలించలేదని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్ రెడ్డి తెలిపారు. స్థానిక సంస్థల కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై ఉత్తమ్ బుధవారం హైదరాబాద్లో స్పందించారు. టీఆర్ఎస్ దిగజారుడు రాజకీయాలు చేసినా తమ పార్టీ రెండు ఎమ్మెల్సీలను కైవసం చేసుకుందని వెల్లడించారు. జీహెచ్ఎంసీలోనూ ఈ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల ప్రభావం ఉంటుందని చెప్పారు.
డివిజన్ కమిటీల అభిప్రాయం మేరకే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టికెట్లు కేటాయిస్తామని ఉత్తమ్ పేర్కొన్నారు. తెలంగాణలో 12 ఎమ్మెల్సీ స్థానాలకు డిసెంబర్ 27వ తేదీన ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల ఫలితాలు ఇవాళ వెల్లడించారు. ఈ ఎన్నికల్లో 10 ఎమ్మెల్సీ స్థానాలను టీఆర్ఎస్, రెండు ఎమ్మెల్సీ స్థానాలకు కాంగ్రెస్ గెలుచుకున్న సంగతి తెలిసిందే.