'పాలనలో టీఆర్ఎస్ విఫలమైంది'
హైదరాబాద్: ప్రజాపాలన సాగించడంలో టీఆర్ఎస్ విఫలమైందని టీజేఏసీ అధ్యక్షుడు ప్రొ. కోదండరాం విమర్శించారు. భవిష్యత్తులో ప్రజా ఉద్యమాలను ఉధృతం చేస్తామని చెప్పారు. అసెంబ్లీలో చర్చలు ఆశించిన స్ధాయిలో జరగడం లేదని అన్నారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీపై ప్రభుత్వ వైఖరి మార్చుకోవాలని కోరారు. ఆదివారం జరిగే టీజేఏసీ సమావేశంలో భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తామని పేర్కొన్నారు.