టీఆర్ఎస్ ఎన్నికల కమిటీ భేటీ


జీహెచ్ ఎంసీ ఎన్నికలపై కసరత్తు చేసేందుకు క్యాంప్ కార్యాలయంలో టీఆర్ఎస్ ఎన్నికల కమిటీ భేటీ అయ్యింది. టీఆర్ఎస్ నేతలు కడియం శ్రీహరి, కేటీఆర్, ఇంద్రకరణ్ రెడ్డి లు ఈ సమావేశానికి హాజరయ్యారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల వ్యూహాలు, ఎన్నికల ప్రచారం పై చర్చించినట్లు తెలుస్తోంది. మరో రెండు రోజుల్లో పార్టీ అభ్యర్థుల జాబితాకు తుది రూపు ఇవ్వాలని నిర్ణయించారు.



 

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top