టీఆర్ఎస్లో చేరికలు
కుత్బుల్లాపూర్: కార్మిక నాయకుడు చింతల నాగరాజు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత డాక్టర్ చింతల యాదగిరి తదితరులు ఆదివారం టీఆర్ఎస్ పార్టీలో చేరారు. కుత్బుల్లాపూర్ నుంచి అనుచరులతో కలిసి టీఆర్ఎస్ భవన్కు వెళ్లి గ్రేటర్ కన్వీనర్ మైనంపల్లి హన్మంతరావు సమక్షంలో వీరు గులాబీ తీర్ధం పుచ్చుకున్నారు. పార్టీ కండువా వేసి వీరిని మైనంపల్లి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా చింతల నాగరాజు మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీలో చేరడం ఎంతో సంతోషంగా ఉందని, పార్టీ పటిష్టత కోసం కృషి చేస్తానని, గ్రేటర్ ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపు కోసం కార్మికులతో కలిసి ప్రచారం చేస్తానని అన్నారు. చింతల రాజలింగం, పలువురు కార్మిక నాయకులు కూడా పార్టీలో చేరారు. కార్యక్రమంలో గ్రేటర్ అడహక్ కమిటీ సభ్యులు శంభీపూర్రాజు, కొలన్ హన్మంత్రెడ్డి, మాజీ కార్పొరేటర్లు జగన్, రావుల శేషగిరి పాల్గొన్నారు.