చోరీ కోసం వచ్చి ప్రసన్నను చంపిన బాలుడు

చోరీ కోసం వచ్చి ప్రసన్నను చంపిన బాలుడు - Sakshi


- ఆ ఇంటికి సమీపంలో ఉండే బాలుడే హత్య చేసినట్లు నిర్ధారించిన పోలీసులు

- లైంగిక దాడికి యత్నించినట్లుగా సందేహాలు


 

 సాక్షి, హైదరాబాద్: సంచలనం రేకెత్తించిన చిన్నారి లక్ష్మీ ప్రసన్న హత్య మిస్టరీ వీడింది. వారి ఇంటికి సమీపంలో ఉండే ఓ బాలుడే ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు. మేడ్చల్ జిల్లా ఎల్లంపేట గ్రామంలో కృష్ణమూర్తి, భవాని దంపతుల కుమార్తె సారుు లక్ష్మీప్రసన్న(8) బుధవారం హత్యకు గురైన విషయం తెలిసిందే. గొంతు, మణికట్టు వద్ద దారుణంగా కోయడంతో తీవ్ర రక్తస్రావమై ఆ చిన్నారి ప్రాణాలు వదిలింది. ఈ నెల 12వ తేదీన ప్రసన్న తల్లిదండ్రులు విధులకు వెళ్లారు. ఆ రోజున పాఠశాలకు సెలవుకావడంతో ప్రసన్న ఇంట్లోనే ఉంది. వారి ఇంటికి సమీపంలో ఉండే ఓ బాలుడు చోరీ చేసేందుకు ఆ ఇంట్లో దూరాడు.



అంతేకాకుండా ప్రసన్నపై లైంగిక దాడికి ప్రయత్నించాడని తెలిసింది. తీవ్ర భయాందోళనకు గురైన ప్రసన్న తన తల్లిదండ్రులకు చెబుతానని ఏడుస్తూ హెచ్చరించింది. దాంతో తన పేరు ఎక్కడ బయటపెడుతుందోనని ఆ బాలుడు ప్రసన్నపై బ్లేడుతో దాడి చేశాడు. గొంతు, మణికట్టుపై తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె మరణించింది.  ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు శనివారం వెల్లడించనున్నారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top