బీఎస్ఎన్ఎల్ కొత్త బ్రాడ్బ్యాండ్ ప్లాన్
హైదరాబాద్: ఇంటర్నెట్ వినియోగదారుల కోసం బ్రాడ్బ్యాండ్ సేవల డేటా డౌన్లోడ్ వేగాన్ని (ఎఫ్యూపీ పరిమితి తర్వాత) ఈ నెల 1 నుంచి 1 ఎంబీపీఎస్కు పెంచినట్లు బీఎస్ఎన్ఎల్ తెలిపింది. గతంలో ఇది 512 కేబీపీఎస్గానే ఉండేదని పేర్కొంది. ప్రస్తుత, కొత్త వినియోగదారులందరికీ తాజా మార్పు వర్తిస్తుందని...ఇందుకోసం ఎటువంటి అదనపు చార్జీలు వసూలు చేయబోమని సోమవారం విడుదల చేసిన ప్రకటనలో వివరించింది. అలాగే హైదరాబాద్ టెలికం జిల్లా బీబీజీ కాంబో 470 ప్లాన్ను ప్రవేశపెట్టినట్లు వివరించింది. ఈ ప్లాన్ కింద రూ. 470 రెంటల్ చార్జీతో 1 ఎంబీపీఎస్ అన్లిమిటెడ్ బ్రాడ్బ్యాండ్ వేగాన్ని అందించడంతోపాటు రెంట్ఫ్రీ ల్యాండ్లైన్ను అందిస్తున్నామని తెలిపింది.