ఎన్డీయే ప్రభుత్వం సంపన్నుల కోసమే
సీపీఐ రాష్ట్ర సమితి సమావేశాల్లో సురవరం
సాక్షి, హైదరాబాద్ : కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం పేదల ప్రభుత్వం కాదని, సంపన్నుల ప్రభుత్వమని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి అన్నారు. రూ.2లక్షల 60 వేల కోట్ల కార్పొరేట్ బకాయిలు మాఫీ చేసిన కేంద్రం రైతులను ఆదుకోవాలని మాత్రం చూడటం లేదని విమర్శించారు.
మఖ్దుంభవన్లో మంగళవారం సీపీఐ రాష్ట్ర సమితి రెండు రోజుల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల్లో జాతీయ, రాష్ట్ర రాజకీయాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు.