ఆమెకు చాన్సిచ్చి.. మంత్రిని అవమానించారు!


హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అధికార టీడీపీ తీరుపై ఆ పార్టీ మహిళా ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. సభలో మాట్లాడే అవకాశాన్ని తరచూ ఓ మహిళా ఎమ్మెల్యేకు ఇస్తున్నారని, ప్రతిపక్ష సభ్యులను విమర్శించడం కోసమే అవకాశం ఇస్తున్నారని చర్చించుకున్నట్టు తెలుస్తోంది.



బుధవారం అసెంబ్లీలో డ్వాక్రా రుణాలకు సంబంధించి ప్రతిపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి మృణాళిని సమాధానం ఇచ్చారు. కాగా మంత్రి సమాధానం ఇచ్చిన తర్వాత కూడా మాట్లాడేందుకు టీడీపీ ఎమ్మెల్యే అనితకు అవకాశం ఇచ్చారు. ఇలా చేయడం మంత్రి మృణాళిని అవమానించడమేనని టీడీపీ మహిళా ఎమ్మెల్యేలు చర్చించుకున్నారు. మంత్రి సమాధానం సరిపోకపోతే మరో మంత్రితో చెప్పిస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top