పెట్టుబడి సాయం వాయిదాకు కుట్ర
సీఎల్పీ ఉపనేత టి.జీవన్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రైతులకు ఎకరానికి రూ.4 వేల పెట్టుబడి సాయం ఇవ్వాలనే నిర్ణయాన్ని వాయిదా వేయడానికే రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన అంటూ సీఎం కేసీఆర్ కొత్త కుట్రకు తెరలేపుతున్నారని సీఎల్పీ ఉపనేత టి.జీవన్రెడ్డి అన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, రైతులకు ఎకరానికి రూ.4వేలను ఈ ఏడాది ఖరీఫ్ నుంచే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన అంటూ కొత్త మాటలు చెబితే ప్రయోజనం ఉండదన్నారు. టీఆర్ఎస్ కార్యకర్తలకు రైతు సమన్వయ సమితులు అనే ముసుగు వేసి, రైతులపై పెత్తనం చేయాలని సీఎం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. విడతలవారీ రుణమాఫీతో రైతులు తీవ్రంగా నష్టపోయారని అన్నారు.