సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి
నల్లగొండ మున్సిపల్ చైర్మన్ భర్త హత్యపై జాజుల డిమాండ్
సాక్షి, హైదరాబాద్: నల్లగొండ మున్సి పల్ చైర్మన్ భర్త శ్రీనివాస్ హత్యపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ ఒక ప్రకటన లో డిమాండ్ చేశారు. దోషు లపై కఠినచర్యలు తీసుకో వాలని కోరారు. బీసీ సామాజిక వర్గం నుంచి ఎది గిన నేత శ్రీనివాస్ను చూసి ఓర్వలేక కొందరు ఈ ఘోరానికి ఒడిగట్టారన్నారు.
తెలంగాణ వస్తే బీసీలకు రాజ్యాధికారం వస్తుందని భావించామ న్నారు. రాష్ట్రంలో బీసీని సీఎం చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తే పొత్తుకు సై అన్న పవన్ కల్యాణ్ మాటలను స్వాగతిస్తున్నా మన్నారు. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకి అధికా రం దక్కాలన్నా బీసీ ఓట్లే కీలకమన్నారు.