బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్‌కు అస్వస్థత

Illness to the BJP state president Laxman - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ లక్ష్మణ్‌ అస్వస్థతకు గురయ్యారు. ఫుడ్‌ పాయిజన్‌ కారణంగా తీవ్ర జ్వరం, విరేచనాలతో బాధపడుతుండటంతో ఆయనను ఆసు పత్రిలో చేర్పించారు. కొన్ని రోజులుగా జిల్లాల్లో పర్యటిస్తున్న ఆయన గురువారం జహీరాబాద్‌లో పార్టీ కార్యక్రమాలకు హాజరయ్యారు. అక్కడే భోజనం చేశారు. కొద్దిసేపటికే లక్ష్మణ్‌ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను హైదరాబాద్‌ తీసుకొచ్చి ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం కోలుకుంటున్నారు. దీంతో శుక్రవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన గణతంత్ర వేడుకలకు హాజరు కాలేదు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top