మందకృష్ణ రథయాత్రకు అనుమతి నిరాకరణ


హైదరాబాద్: మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ తలపెట్టిన రథయాత్రకు హైకోర్టు అనుమతి నిరాకరించింది. యాత్ర చేపడితే శాంతి భద్రతల సమస్యలు వస్తాయన్న పోలీసుల వాదనతో కోర్టు ఏకీభవించింది. దీంతో సింగిల్ బెంచ్ తీర్పుపై  మందకృష్ణ డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించనున్నారు. కాగా ఎస్సీల వర్గీకరణపై అసెంబ్లీలో తీర్మానం చేయాలంటూ చిత్తూరు జిల్లాలోని నారావారి పల్లి నుంచి మందకృష్ణ విశ్వరూప రథయాత్రను చేపట్టాలనుకున్న విషయం తెలిసిందే.



 

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top