27 వరకు గ్రూపు– 2 సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌

27 వరకు గ్రూపు– 2 సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌

సాక్షి, హైదరాబాద్‌: గ్రూపు– 2 పోస్టుల భర్తీలో భాగంగా రాత పరీక్షలో అర్హత సాధించి, సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు ఎంపికైన అభ్యర్థుల జాబితాను, అభ్యర్థులు వెంట తెచ్చుకోవాల్సిన సర్టిఫికెట్ల వివరాలను టీఎస్‌పీఎస్సీ తమ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. గురువారం(21న) నుంచి 27 వరకు అభ్యర్థులకు కూకట్‌పల్లిలోని జేఎన్‌టీయూహెచ్‌లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ నిర్వహించనున్నట్లు పేర్కొంది. ప్రతిరోజూ ఉదయం 10 గంటలకు, మధ్యాహ్నం 2 గంటలకు వెరిఫికేషన్‌ ఉంటుందని చెప్పింది.



ఈ నెల 21న మా త్రం వెరిఫికేషన్‌ మధ్యాహ్నం 12గంటలకు ప్రారంభం అవుతుందని తెలిపింది. ఉద యం, మధ్యాహ్నం హాజరుకావాల్సిన అభ్యర్థుల వివరాలను తేదీల వారీగా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. గతంలో సర్టిఫికెట్ల వెరిఫికేష న్‌కు హాజరైన అభ్యర్థుల జాబి తాను కూడా వెబ్‌సైట్‌లో ఉం చింది. ఇప్పుడు నిర్వ హించే వెరిఫికేషన్‌కు వారు హాజరుకా వాల్సిన అవసరం లేదని పే ర్కొంది. 1,032 పోస్టులకు 1:3 నిష్పత్తిలో అభ్య ర్థులను సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు ఆహ్వానించింది.  
Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top