8 నుంచి ధ్రువపత్రాల పరిశీలన


కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఎంపికైనవారికి 13న మెడికల్‌ టెస్ట్‌



సాక్షి, హైదరాబాద్‌: పోలీస్‌ కానిస్టేబుల్‌(సివిల్‌/ఏఆర్‌) భర్తీకి సంబంధించి ప్రాథమికఎంపిక జాబితాలో ఉన్న అభ్యర్థుల ధ్రువపత్రాలను ఈ నెల 8 నుంచి 10వ తేదీ వరకు పరిశీలించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ఒక ప్రకటనలో పేర్కొంది. అభ్యర్థులు తమ ఒరిజినల్‌ సర్టిఫికెట్లతో హాజరు కావాలని సూచించింది.



ఈ నెల 13న అభ్యర్థులకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్లు, నిర్దేశిత తేదీల్లో రిపోర్టు చేయని అభ్యర్థులను అనర్హులుగా ప్రకటించనున్నట్లు తెలిపింది. అభ్యర్థుల సమాచార పత్రాలు, ఇతర వివరాలను బోర్డు వెబ్‌సైట్లో ఈ నెల 7వ తేదీ నుంచి అందుబాటులో ఉంచుతామని పేర్కొంది. ఎంపిక జాబితాలో పేర్లు రాని 153 మంది చాలెంజ్‌ చేసిన నేపథ్యంలో వారికి త్వరలో సమాచారం ఇస్తామని వివరించింది.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top