'ఓలా' ఆఫీసు వద్ద గందరగోళం
హైదరాబాద్: మాదాపూర్లోని ఓలా క్యాబ్స్ ఆఫీస్ వద్ద క్యాబ్ డ్రైవర్లు ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ గందరగోళ వాతావరణం నెలకొంది. అగ్రిమెంట్ చేసుకున్నా క్యాబ్ డ్రైవర్లను సంస్థ మోసం చేస్తుందని వారు ఆరోపిస్తున్నారు. కిలోమీటర్కు రూ.17 ఇస్తానని అగ్రిమెంట్ సమయంలో చెప్పి, ఇప్పుడు కేవలం రూ.9 మాత్రమే ఇస్తున్నారని డ్రైవర్లు ధర్నాకు దిగారు. పని వేళలు కూడా ఎక్కువ చేశారని ఆందోనళ చేశారు. వెంటనే తమకు న్యాయం చేయాలని ఓలా క్యాబ్ డ్రైవర్లు డిమాండ్ చేస్తున్నారు.