అవినీతిని కాపాడుతున్నారా?
కేంద్రమంత్రి వెంకయ్యకు భూమన సూటిప్రశ్న
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ సంస్థ జరిపిన సర్వేలో అత్యంత అవినీతి రాష్ట్రంగా తేలిన ఏపీపై ఏ రకమైన చర్యలు తీసుకోకుండా ఉండటానికే కాపాడుతున్నారా? అని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడిని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి ప్రశ్నించారు. ప్రతిపక్షాలు ప్రత్యేకహోదా పేరిట చిచ్చుపెడుతు న్నాయని, చంద్రబాబును తానే కాపాడుతున్నానని ఓ పత్రిక ఇంటర్వూ్యలో పేర్కొనడాన్ని ఆక్షేపించారు. ప్రత్యేక హోదా కంటే ప్యాకేజీ మేలు అని ప్రచారం చేస్తూ.. ప్రజల్లో విష బీజాలు నాటుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, వెంకయ్యనాయుడులు అదే మాటను ప్రధాని నరేంద్ర మోడీతో చెప్పించగలరా? అని సవాలు విసిరారు. వైఎస్సార్సీపీ ప్రత్యేక హోదా కోసం ఎందాౖకైనా పోరాడుతుందని స్పష్టం చేశారు. ఆయన శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.
అన్యాయం జరిగినా చప్పట్లు కొడుతున్న సీఎం
కేంద్ర మంత్రి అరుణ జైట్లీ సెప్టెంబరు 8, 2016 అర్ధరాత్రి ప్రకటన చేసేవరకు ప్రత్యేక ప్యాకేజీ అనేది ప్రజలకు తెలీదని భూమన చెప్పారు. హోదా కంటే ప్యాకేజీ గొప్పదైతే బడ్జెట్లో మిగిలిన రాష్ట్రాల కంటే ఒక్క రూపాయి కూడా ఎక్కువ నిధులు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగినా, చప్పట్లు కొట్టిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని ఎద్దేవా చేశారు. మహానేత వైఎస్ఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తే.. చంద్రబాబు పోరాడే వాళ్లను జైల్లో పెడుతున్నారని ఆరోపించారు. రాష్ట్ర విభజనతో ఆస్తిపంజరంలా తయారైన రాష్ట్రాన్ని చంద్రబాబు సిక్స్ప్యాక్లా చూపించే ప్రయత్నం చేస్తున్నారని భూమన ఎద్దేవా చేశారు.