ఏప్రిల్‌ 29న భారీ బహిరంగసభ

On April 29 a massive public meeting - Sakshi

యాదవ, కురుమలు భారీగా తరలిరావాలని తలసాని పిలుపు

సాక్షి, హైదరాబాద్‌: రాజధానిలోని జింఖానాగ్రౌండ్‌లో వచ్చే నెల 29న పది లక్షల మంది యాదవ, కురుమలతో భారీ బహిరంగసభ నిర్వహించనున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌ వెల్లడించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ హాజరవుతారని చెప్పారు.

ఈ సభ తర్వాత రాజకీయంగా యాదవ, కురుమల దశ మారబోతుందన్నారు. బుధవారం సచివాలయంలోని ఆ రెండు కులాలకు చెందిన ముఖ్యనాయకులతో సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. 

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top