ఎంసెట్ స్కామ్లో మరో వ్యక్తి అరెస్ట్
హైదరాబాద్: ఎంసెట్-2 పేపర్ లీకేజీ కుంభకోణంలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. తాజాగా తమిళనాడుకు చెందిన రాజేష్ రాజశేఖర్ అనే వ్యక్తిని సీఐడీ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు.
ఇతను ఆరుగురు విద్యార్థులకు ఎంసెట్ పేపర్ లీక్ చేసినట్లు అధికారులు తెలిపారు. రాజశేఖర్ను పోలీసులు విచారిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.