ప్రజాసంకల్పయాత్ర 129వ రోజు షెడ్యూల్
సాక్షి, గుంటూరు : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్పయాత్ర 129వ రోజు షెడ్యూల్ ఖరారైంది. గురువారం ఉదయం ఆయన వేజెండ్ల శివారు నుంచి పాదయాత్రను ప్రారంభించనున్నారు. అక్కడ నుంచి వడ్లమూడి, పాలపూడి క్రాస్, గరువుపాలెం మీదగా శేకుర్ క్రాస్ వరకూ ప్రజాసంకల్పయాత్ర కొనసాగనుంది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం పాదయాత్ర షెడ్యూల్ను విడుదల చేశారు.