111వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం
సాక్షి, గుంటూరు : ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 111వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభమైంది. మంగళవారం ఉదయం ఆయన బాపట్ల శివారు నుంచి పాదయాత్రను ఆరంభించారు. బాపట్ల మూర్తి రక్షణ నగరం, కొండుబొట్లవారి పాలెం క్రాస్, అప్పికట్ల, పూండ్లక్రాస్ మీదగా ఈతేరు వరకూ ప్రజాసంకల్పయాత్ర కొనసాగనుంది. ఈతేరులో వైఎస్ జగన్...ప్రజలతో మమేకం అవుతారు. ఇప్పటివరకూ వైఎస్ జగన్ 1,484.2 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు.