ఈ విషయాలు మీకు తెలుసా?
హైదరాబాద్: మన దేశంలో ఏ పాలు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి? పాలలో నీటి శాతం ఎంత? దంపుడు బియ్యంలో పోషక విలువలు ఎక్కువగా ఉంటాయా? తులసి రసం దేనికి ఉపయోగపడుతుంది?.. ఇటువంటి విషయాలు మీకు తెలుసా? తెలియకపోతే ఆ వివరాలు మీకు అందిస్తున్నాం చదవండి.
* మన దేశంలోని పాల ఉత్పత్తిలో గేదె పాలు 53 శాతం ఉంటాయి.
* ఆవు పాలు 43 శాతం ఉంటాయి.
* మేక పాలు 3 శాతం నుంచి 4 శాతం ఉంటాయి.
* స్వదేశీ ఆవుల పాలలో 86.4 శాతం నీరు ఉంటుంది.
* గేదె పాలలో 83. 6 శాతం నీరు ఉంటుంది.
* పాల పదార్థాలలో నెయ్యి మాత్రమే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది.
* పాడి పశువుల నిర్వహణకయ్యే ఖర్చులో 60 నుంచి 70 శాతం మేతకు ఖర్చవుతుంది.
* పోషక విలువలలో సన్నబియ్యానికి, దొడ్డు బియ్యానిక తేడా ఉండదు.
* ఏ రకం బియ్యమైనా దంపుడు బియ్యంలోనే పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి.
* తులసి రసం రక్తాన్ని శుద్ధి చేస్తుంది - వృద్ధి చేస్తుంది.